తిరుమల నుంచి కొందరు భక్తులు తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఘాట్ రోడ్డులో 16 మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి జీపు బోల్తా పడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న భక్తులలో నలుగురికి గాయాలయ్యాయి. మరోవైపు వెనుక నుంచి వచ్చిన కారు కూడా బోల్తా కొట్టిన జీపును ఢీకొంది. కాగా గాయపడిన భక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు.