ఇడుపులపాయలో వైకాపా క్యాంపు రాజకీయం

శనివారం, 12 జులై 2014 (16:46 IST)
నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠతకు దారితీస్తోంది. రేపు నెల్లూరు జిల్లా జడ్పీఛైర్మన్ ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో వైకాపాకు చెందిన 30 మంది జడ్పీటీసీ సభ్యులతో వైకాపా ఇడుపులపాయలో క్యాంప్ ఏర్పాటు చేసింది.
 
కావలి జడ్పీటీసీ సభ్యురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇడుపులపాయకు వచ్చిన పోలీసులను వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. జడ్పీటీసీలను తీసుకెళ్లడానికి వచ్చిన పోలీసులు వారికోసం ఇడుపులపాయలో వేచి ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి