కొత్త ఎమ్మెల్యేలతో భేటీ కానున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసీఆర్ శనివారం సాయంత్రం పార్టీ తరపున తాజా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో శుక్రవారం కేసీఆర్ నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కేసీఆర్ విధానాలే కారణమంటూ కొందరు సీనియర్ నేతలు అసంతృప్తి చెందడంతో పాటు విడిగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీనుంచి విడిపోయేందుకు నిర్ణయించినట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయమై కేసీఆర్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సైతం సమావేశం నిర్వహించకపోవడం పార్టీ శ్రేణుల్లో విస్మయాన్ని కలిగిస్తోంది.

ఇలాంటి తరుణంలో పార్టీలో ఏర్పడిన గందరగోళాన్ని తొలగించే దిశగా, కొత్త సభ్యులకు నచ్చజెప్పేందుకై కేసీఆర్ శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి