తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నేతగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు పార్టీ ప్రధాన కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబును ఎన్నుకున్నారు.
చంద్రబాబు పేరును ఆ పార్టీ సీనియర్ నేత అశోకగజపతి రాజు ప్రతిపాదించగా, మిగిలిన సీనియర్ నేతలు బలపరిచారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపాకు 90 అసెంబ్లీ సీట్లు దక్కిన విషయం తెల్సిందే. నాలుగు పార్టీలతో మహాకూటమిగా ఏర్పడి పోటీ చేసినప్పటికీ, అధికారాన్ని కైవసం చేసుకోలేక పోయింది.