పీఆర్పీకి మసాల ఈరన్న రాజీనామా...!

ప్రజారాజ్యం పార్టీకి కర్నూలు జిల్లా ఆలూరు మాజీ జడ్పీటీసీ మసాలా ఈరన్న రాజీనామా చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రజారాజ్యం పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

తాజాగా కర్నూల్‌ జిల్లాకు చెందిన మాజీ జడ్పీటీసీ మసాలా ఈరన్న ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రరాపా పూర్తిగా భ్రష్టుపట్టిపోయినందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు మీడియాకు తెలిపారు.

ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవీ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు.

వెబ్దునియా పై చదవండి