పొద్దు తిరుగుడు విత్తనాలు.. స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుందట!

సోమవారం, 24 జులై 2023 (15:25 IST)
sunflower
పొద్దు తిరుగుడు విత్తనాలు అత్యంత పోషకమైన విత్తనాలలో ఒకటి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పొద్దు తిరుగుడు పువ్వులు సాధారణంగా రెండు రకాలు. ఒకటి నూనె కోసం, మరొకటి విత్తనాల కోసం సాగు చేస్తారు. 
 
ముఖ్యంగా పొద్దు తిరుగుడు విత్తనాలు వ్యాధిని నివారించడానికి, పోరాడటానికి సహాయపడతాయి. అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల మంచి మూలం. పొద్దుతిరుగుడు గింజల్లోని సెలీనియం ఇన్‌ఫ్లమేషన్, ఇన్‌ఫెక్షన్‌తో పోరాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. 
 
విత్తనాలలో విటమిన్ ఇ, జింక్, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు కణాలకు ఫ్రీ రాడికల్ నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తాయి.
 
పొద్దు తిరుగుడు విత్తనాలలో రక్తనాళాల సంకోచానికి కారణమయ్యే ఎంజైమ్‌లను నాశనం చేసే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త నాళాలను సడలించడం వల్ల రక్తపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. విత్తనాల్లోని మెగ్నీషియం ధమనుల గోడలపై రక్తపోటును నివారిస్తుంది.
 
ప్రతిరోజూ కొన్ని పొద్దు తిరుగుడు గింజలను తినడం వల్ల ఆరు నెలల్లో రక్తంలో చక్కెర స్థాయిలను 10 శాతం తగ్గించవచ్చు. ఈ విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు