చైనాతో ఘర్షణలో తమ సైనికులు చనిపోయారని భారత సైన్యం చెప్పటం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వశాఖను ప్రశ్నించగా.. భారతదేశం ఏకపక్ష చర్యలు చేపట్టరాదని, ఇబ్బందులను పెంచరాదని చైనా స్పందించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
1975 తర్వాత తొలి హింసాత్మక ఘర్షణ
భారత్ - చైనాల మధ్య 1975 తర్వాత.. ప్రాణ నష్టానికి దారితీసిన తొలి హింసాత్మక సంఘటన ఇదేనని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది. గాల్వాన్ లోయ ప్రాంతం ఇండియా - చైనాల మధ్య లదాఖ్ సరిహద్దు రేఖ మీద ఉంది.
ఈ ప్రాంతంలో చైనా బలగాలు ఇటీవల భారత భూభాగంలోకి ప్రవేశించటంతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తలెత్తింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించటానికి భారత్ - చైనాలు తూర్పు లదాఖ్లో చర్చలు జరుపుతున్నాయి. అనేక వారాలుగా సరిహద్దులో ఇరు దేశాల సైనిక బలగాలు మోహరించిన అనేక ప్రాంతాల విషయంలో ఇరు పక్షాల మధ్య.. భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సైనిక వర్గాలు చెప్తున్నాయి.