పాదాల పగుళ్లకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?

FILE
టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు ఏర్పడినట్లే పాదాల్లో పగుళ్లు కూడా ఏర్పడుతున్నాయి. ప్రారంభంలోనే పాదాలను పరిరక్షించడంపై ఆసక్తి చూపితే, శాశ్వతంగా పగుళ్లకు చెక్ పెట్టవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మరి పాదాల పగుళ్లకు చెక్ పెట్టే టిప్స్ ఏంటో మీకు తెలుసా..? అయితే ఈ కథనం చదవాల్సిందే.

గోరింటాకును బాగా రుబ్బుకుని పగుళ్లు ఉన్న చోట రాసుకుని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు. పాదాలు తట్టుకునేంత వేడినీటిలో కాస్త ఉప్పు, నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి, బ్రష్‌తో పాదాలను రుద్దినట్లైతే బ్యాడ్ సెల్స్‌కు చెక్ పెట్టవచ్చు.

వేపాకు, పసుపులో కాసింత సున్నం కలిపి పేస్ట్‌లా రుబ్బుకుని, ఆముదంలో చేర్చి పగుళ్లకు రాసినట్లైతే ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి గుజ్జును పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా నాణ్యత గల స్లిపర్స్, షూస్ వాడటం ద్వారా పగుళ్లు దరిచేరవు.

అలాగే ఆముదం, కొబ్బరి నూనె సమపాళ్ళలో తీసుకుని అందులో పసుపు పొడి చేర్చి రోజూ పాదాలకు రాస్తే పగుళ్లను దూరం చేసుకోవచ్చు. రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో పాదాలను శుభ్రం చేసుకుని కొబ్బరి నూనె రాస్తే పగుళ్లు ఏర్పడవు.

వెబ్దునియా పై చదవండి