* తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్లా మెత్తగా మారుతుంది.
* నారింజ రసం తీసుకోండి. దానికి పాలు కలిపి ముఖానికి చేతులకు పట్టించండి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు మాయమవుతాయి.
* ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూను పాలపొడి, రెండు స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపి మిశ్రమంగా తయారుచేసి మొహానికి రాసుకొని ఆరే వరకు అలాగే ఉంచుకొని తరువాత గోరువెచ్చని నీటితో మొఖాన్ని కడిగేయాలి. దీనివల్ల చర్మం బాగా శుభ్ర్రపడటమే కాక రక్తప్రసరణ మెరుగవుతుంది.