బొప్పాయి గుజ్జు ఒక టేబుల్ స్పూన్, తేనె ఒక స్పూన్, నిమ్మరసం రెండు స్పూన్లు కలిపి పేస్ట్లా తయారయ్యాక ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. చర్మం పొడిబారకుండా ఉంటుంది.
ఇక బాదం, ఓట్స్ సరిపాళ్ళలో తీసుకుని బాగా పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే..ముఖం కాంతివంతంగా తయారవుతుంది. అయితే మొటిమలు, సెన్సెటివ్ చర్మం కలిగినవారు ఈ మిశ్రమాన్ని ఉపయోగించకూడదని బ్యూటీ నిపుణులు అంటున్నారు.