ఈ రోజుల్లో యువత ఫాస్ట్ ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లకు అలవాటుపడి పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతుంది. దీంతో యంగ్ ఏజ్లోనే హెయిర్ డైలు వేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడాలంటే తలకు ఆవాల నూనె రాసుకుంటే సరి.
ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మాడుకు ఆవ నూనెను రాసుకుని, సున్నితంగా మర్దన చేసుకుని ఉదయాన్నే తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మొదట జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. ఆ తర్వాత క్రమంగా అది నల్లబడుతుంది.
ముఖంపై ముడతలతో చిన్న వయసులోనే ముసలివారిలా కనపడుతున్నారు. అయితే ఒక్కసారి ఈ ఇంటి చిట్కా చదవండి. పనసపండు తిన్నాక వాటి గింజలను పడేస్తాం. అలా కాకుండా వాటిని రాత్రంతా చల్లటి పాలలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని రుబ్బి పేస్ట్లా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. అలా వారానికి నాలుగైదుసార్లు చేస్తే ముడతలు తప్పకుండా తగ్గిపోతాయి.