మృదువైన చర్మం కోసం.. హెల్దీ ప్యాక్..!

సోమవారం, 22 డిశెంబరు 2014 (14:43 IST)
మృదువైన చర్మం కోసం హెల్దీ ప్యాక్ వేసుకోండి. చెంతా తాజా కీరదోస గుజ్జుకి చెంచా మీగడ, రెండు చెంచాల  క్యారెట్ రసం కలిపి ఆ మిశ్రమాన్ని దట్టంగా మెడ నుంచి ముఖం వరకూ పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మానికి పోషకాలు అంది మృదువుగా మారుతుంది.
 
క్యారెట్ రసం, నిమ్మరసం, శెనగపిండి సమపాళ్లలో తీసుకుని పాపు కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు కాళ్లూ చేతులూ, మెడ దగ్గర పట్టించి ఆరాక గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 

వెబ్దునియా పై చదవండి