ఇలాంటి వాటిని తగ్గించేందుకు గృహ చిట్కాలకు పాటిస్తే కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు. శెనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇది 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. తరచుగా ఇలా చేస్తే మొటిమలు తగ్గుతాయని వారు చెపుతున్నారు.
అలాగే, ఉల్లిరసంలో కొంచెం తేనె కలపాలి. దీన్ని మొటిమల మచ్చలపై రాయాలి. గంట తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది. ఇవేకాకుండా, గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల బాధ నుంచి కొంతమేరకు ఉపశమనం పొందవచ్చని బ్యుటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.
ఒక స్పూన్ మెంతులపొడి, ఒక స్పూన్ పసుపుపొడి, దోసకాయగుజ్జు, ఒక స్పూన్ టమోట రసం, కొబ్బరినీళ్లు కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. మెంతికూర, వేపాకు చిగుళ్లు, పసుపు కలిపి నూరాలి.