నిమ్మరసం, బాదం, నూనె, పాలు, తేనెలను కలిపి మిశ్రమాన్ని పది రోజులు ఈ మచ్చల మీద రాస్తే అవి తొలిగిపోతాయి. అయితే ఈ మిశ్రమాన్ని రాసిన తర్వాత ఎండలో వెళ్లకూడదు.
అలాగే మార్కెట్లో అవకాడో నూనె దొరుకుతుంది. దీనిలో రెండు టమోటాల గుజ్జు, ఒక పొడవు దోసకాయ గుజ్జును కలపాలి. ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఇరవై నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో మొహాన్ని కడుక్కొవాలి. ఇలా పదిహేను రోజులు చేస్తే మచ్చలు పోతాయి.