అరకప్పు ఓట్స్‌తో కాంతివంతమైన చర్మం!

బుధవారం, 19 నవంబరు 2014 (14:50 IST)
అరకప్పు ఓట్స్‌ను తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెరుగు, టమోటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. 
 
వారానికోసారి ఇలా చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతమవుతుంది. అలాగే.. బాదంపప్పు పేస్టులో పాలు, నిమ్మరసం, కాసింత మినప్పిండి కలిపి ప్యాక్‌లా వేసుకున్నా ముఖం మెరిసిపోతుంది.

వెబ్దునియా పై చదవండి