కేంద్ర వార్షిక బడ్జెట్ 2016-17కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి సోమవారం ఉదయం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ఆమోదించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
అంతకుముందు.. ఆయన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడ నుంచి ఆయన పార్లమెంటుకు చేరుకున్నారు. అలాగే, అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న ఆర్థిక బడ్జెట్ ప్రతులను అధికారులు పార్లమెంటుకు చేర్చారు. వీటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోక్సభ సభ్యులకు అందజేస్తారు.