అపర కుబేరుడు ముఖేష్ అంబానీ: ఫోర్బ్స్

ప్రతి ఏటా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించే ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఈసారి కూడా ముకేశ్ అంబానీ చోటు దక్కించుకున్నారు. ఆయనకు ఈ కిరీటం దక్కడం వరుసగా ఇది రెండోసారి.

పెట్రోకెమికల్స్ రంగంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ రెండు వేల తొమ్మిది వందల0 కోట్ల డాలర్ల విలువ గల ఆస్తులతో ఫోర్బ్స్ ప్రపంచ సంపన్నుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.

కాగా ఈ జాబితాలో ముగ్గురు తెలుగు పారిశ్రామికవేత్తలు కూడా స్థానం సంపాదించడం విశేషం. జిఎంఆర్ ఇండస్ట్రీస్ సారథి గ్రంధి మల్లికార్జునరావు 320 కోట్ల డాలర్ల ఆదాయంతో తొలి 500 మంది ప్రపంచ కుబేరుల్లో స్థానం దక్కించుకున్న ఏకైక తెలుగువాడుగా నిలిచారు. అదేవిధంగా డాక్టర్ అంజిరెడ్డి, జి.వి.కె.రెడ్డిలు 100 కోట్ల డాలర్ల నికర విలువతో 937వ స్థానాన్ని దక్కించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి