గ్రామీణ మార్కెట్లపై సేవాపన్ను విధించకండి: స్వాతి పిరమల్

సోమవారం, 5 ఏప్రియల్ 2010 (14:48 IST)
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపార మార్కెట్లపై సేవాపన్ను విధించకూడదని అస్సోచెమ్ అధ్యక్షురాలు స్వాతి పిరమల్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను సోమవారం న్యూ ఢిల్లీలో కోరారు. దీంతో కంపెనీల నుంచి ఉత్పత్తయ్యే వస్తువులు తక్కువ ధరలకే లభిస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

తాము ఆర్థిక మంత్రిని కలిసి ఈ అంశంపై వినతి పత్రం సమర్పించామని ఆమె తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాపార మార్కెట్లలో ఉత్పత్తయ్యే వస్తువులకు మంచి డిమాండ్ ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో సేవాపన్నును విధించడం సమంజసం కాదని ఆమె తెలిపారు. సేవాపన్నును తొలగించడంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరకే వస్తువులను అందించే వీలు కలుగుతందని ఆమె పేర్కొన్నారు.

తాము ఆర్థికమంత్రికి విన్నవించిన వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వస్తువులు, బ్రాండ్ కలిగిన కంపెనీల వస్తువులు లభిస్తాయని ఆమె అన్నారు. దీంతో నకిలీ వస్తువులను పరోక్షంగా నిరోధించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి