చర్చలకు రండి...ప్రఫుల్ పటేల్

FILE
ఆగస్టు నెల 18న విమాన సర్వీసులు నిలుపుదల చేస్తున్నట్లు శుక్రవారం పలు విమానయాన సంస్థలు ప్రకటించడంతో సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమతో చర్చలకు రావాలని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి ప్రఫుల్ పటేల్ కోరారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థికమాంద్యం కారణంగా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ విమానయాన సంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలు ఈ నెల 18న తమ సర్వీసులను నిలుపుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో మంత్రి విమానయాన సంస్థల యజమానులను చర్చలకు ఆహ్వానించారు.

విమానయాన రంగం ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుందని, అయితే ప్రజలకు ఇబ్బంది జరగే ఎలాంటి పనినైనా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఆయన అన్నారు.

ప్రభుత్వం పిలిచిన మేరకు చర్చలకు రావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి