తూర్పు చైనా ఎయిర్లైన్స్, షాంఘై ఎయిర్లైన్స్ విలీనానికి రంగం సిద్ధమవుతున్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఈ రెండు పౌర విమానయాన సంస్థల విలీనం ద్వారా చైనాలో అతిపెద్ద ఏవియేషన్ కంపెనీ ఏర్పాటుకు వీలు ఏర్పడుతుంది. జూన్ 8 నుంచి చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్, షాంఘై ఎయిర్లైన్స్ అధికారికంగా పునఃవ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభించనున్నాయి.
దీనికి సంబంధించి మిగిలిన వివరాలు వెల్లడించేందుకు చైనా ఈస్ట్రన్ ఎయిర్లైన్స్ ప్రతినిధి నిరాకరించారు. చైనా ప్రభుత్వం ఈ రెండు ఎయిర్లైన్స్ విలీనానికి ఆదేశాలు జారీ చేసిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. మార్కెట్లో సోమవారం రెండు కంపెనీల షేర్ల లావాదేవీలను నిలిపివేశారు. మంగళవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.