టెలికాం ఆపరేటర్ల అభిప్రాయాలను గౌరవిస్తాం: ప్రధాని

ట్రాయ్, టెలికాం శాఖ సాగిస్తున్న పెత్తనంతో లాభాల్లో కోత పడిందని టెలికాం ఆపరేటర్ల గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో తీసుకోబోయే విధివిధానాల్లో టెలికాం ఆపరేట్ల అభిప్రాయాలను గౌరవిస్తామని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.

ఇంకా టెలికాం రంగ అభివృద్ధికి రూపొందించే విధివిధానాల్లో టెలికాం ఆపరేటర్ల అభిప్రాయాలకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. టెలికాం రంగంలో వృద్ధికి ఆపరేట్లర సహాయం ఎంతో అవసరమని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే 3జి రోమింగ్‌కు ఏక కాల స్పెక్ట్రమ్ చార్జీల విషయంతోపాటు లైసెన్సు ఫీజలు ఒకేలా ఉండటం వంటి వాటిపై టెలికాం మంత్రిత్వ శాఖ నిర్ణయాలు టెలికాం ఆపరేటర్లకు ఇబ్బందిగా ఉండటంతో టెలికాం ఆపరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి