బెర్గర్ పెయింట్స్ లాభం రూ.88 కోట్లు

ఆదివారం, 21 జూన్ 2009 (14:50 IST)
పెయింట్స్ ఉత్పత్తి కంపెనీల్లో ఒకటిగా పేరుగాంచిన బెర్గర్ పెయింట్స్.. గత మార్చి 31వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 88 కోట్ల రూపాయల మేరకు ఆదాయాన్ని అర్జించినట్టు ఆ సంస్థ వెల్లడించింది. 2007-08 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం 92 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు తెలిపింది.

కంపెనీ మొత్తం విక్రయాల్లో 12.5 శాతం వృద్ధి సాధించగా, కంపెనీ మొత్తం వ్యావారం 1514 కోట్ల రూపాయలుగా నమోదైనట్టు సంస్థ తెలిపింది. క్రితం సంవత్సరం కంపెనీ ఆదాయం రూ.1346 కోట్లుగా నమోదైనట్టు పేర్కొంది.

ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల కంపెనీ నికర ఆదాయంలో తగ్గుదల కనిపించింది. ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక మాంద్యం కారణంగా కంపెనీ ఉత్పత్తుల విక్రయాల్లో మందగమనం ఏర్పడిందని ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

వెబ్దునియా పై చదవండి