ఆలోక్ కుమార్ మిశ్రా బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్గా బుధవారం నియమితులైనారు.
దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ మిశ్రా ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులైనట్లు ఓబీసీ బుధవారం ప్రకటించింది.
ఓబీసీ మేనేజింగ్ డైరెక్టర్గానున్న ఆలోక్ కుమార్ మిశ్రాను బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యక్షునిగా నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ధృవీకరించింది. మిశ్రా బుధవారమే పదవీ బాధ్యతలను స్వీకరించినట్లు అధికారులు వెల్లడించినట్లు ఆ ప్రకటన తెలిపింది.