భారత్‌లోని సంపన్నుల్లో ముకేశ్‌కు తొలి స్థానం: ఫోర్బ్స్

గురువారం, 19 నవంబరు 2009 (16:05 IST)
FILE
ఫోర్బ్స్ పత్రిక తాజాగా భారతదేశంలోని సంపన్నుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దేశీయ సంపన్నుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీకి మొదటి స్థానం దక్కింది.

రిలయన్స్ సోదరుల్లో పెద్దవాడైన ముకేశ్ అంబానీకి ఫోర్బ్స్ పత్రిక భారతదేశంలోని సంపన్నుల్లో మొదటి స్థానం కల్పించింది. ఆయన తర్వాతి స్థానాల్లో వరుసగా ఉక్కు దిగ్గజమైన లక్ష్మీ మిట్టల్, అనిల్ అంబానీ, అజీమ్ ప్రేమ్‌జీ, శశి అండ్ రవి రుయా, కెపి సింగ్ తదితరులున్నారు.

భారతదేశంలోని వంద మంది సంపన్నుల సంపద 276 బిలియన్ డాలర్లని, ఇది దేశ జిడిపిలో నాలుగో వంతని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అలాగే భారతీయ బిలియనీర్ల సంఖ్య కూడా నిరుడుకన్నా రెట్టింపైందని ఆ పత్రిక తెలిపింది.

ఇదిలావుండగా జిందాల్ సంస్థలకు చెందిన సావిత్రి జిందాల్ 12 వందల కోట్ల డాలర్ల ఆదాయంతో 7వ స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. తమ లిస్ట్‌లో సుశ్రీ జిందాల్‌తోపాటు మరో ఆరుగురు మహిళామణుల పేర్లుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి