సనంద్‌నుంచి ఈ ఏడాది చివర్లో "నానో"

FILE
దేశీయ కార్ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న టాటామోటార్స్ సంస్థ ఈ ఏడాది చివరికల్లా గుజరాత్‌లోని సనంద్ వద్ద నెలకొల్పుతున్న కర్మాగారంనుంచి నానోకార్ల తయారీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

సనంద్‌లోనున్న కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ప్రతి ఏడాది దాదాపు 2.5 లక్షల కార్లను నిర్మించేందుకు లక్ష్యంగా ఉంచుకున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు.

రానున్న సంవత్సరం జులై నాటికి దాదాపుగా 60,000 కార్లను తమ వినియోగదారులకు అందించే ప్రయత్నంలో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి