విజయవాడలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో రూ.1240 కోట్ల విలువైన 8 పర్యాటక ప్రాజెక్టులపై ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడ, తిరుపతి, విశాఖల్లో ఎమ్యూజెమెంట్, వాటర్ వరల్డ్ పార్కులు నిర్మించనున్నారు.
డెస్టినేషన్ అండ్ ప్యాకేజ్ టూర్లు, హోటల్స్, రిసార్టులు, బీచ్ రిసార్టులు , ఫైవ్స్టార్, తీస్టార్ హోటళ్లు, కడపలో వే సైడ్ అమెనిటీస్ ఏర్పాటు తదితర ఒప్పందాలు ఖరారయ్యాయి. తిరుచానూరులో గేట్వే హోటల్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. రెండకెరాల విస్తీర్ణంతో రూ.85 కోట్ల పెట్టుబడితో గేట్వే హోటల్ను నిర్మించనున్నారు.