స్వచ్ఛ్‌ భారత్‌ ఉద్యమానికి అంకితం: అనిల్‌ అంబానీ

శుక్రవారం, 3 అక్టోబరు 2014 (15:42 IST)
స్వచ్ఛ్‌ భారత్‌లో భాగస్వామిగా మారిన రిలయన్స్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ తనకు తానగా ఈ ఉద్యమానికి అంకితమవుతున్నట్టు ప్రకటించారు. స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌లో భాగస్వామి కావాలని ప్రధాని తనని కోరడం అత్యంత గౌరవంగా భావిస్తున్నట్టు అనిల్‌ పేర్కొన్నారు. 
 
స్వచ్ఛ్‌ భారత్‌ ప్రచారం కోసం మోదీ ఎంచుకున్న వారిలో అనిల్‌ అంబానీ, సచిన్‌ టెండూల్కర్‌, సల్మాన్‌ఖాన్‌, ప్రియాంకా చోప్రా, కమల్‌ హాసన్‌, యోగాగురువు రామ్‌దేవ్‌ బాబా, కాంగ్రెస్‌ నాయకుడు శశి థరూర్‌ ఉన్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి