ఫ్రీడమ్ 251 కంపెనీ మమ్మల్ని మోసం చేసింది.. కేసు పెడతామన్న సైప్యూచర్!
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2016 (16:23 IST)
ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ సంచలనం సృష్టించిన రింగింగ్ బెల్స్పై హెల్ లైన్ భాగస్వామిగా వ్యవహరిస్తోన్న సై ఫ్యూచర్ కంపెనీ కేసు పెడతానంటోంది. తమకు చెల్లించాల్సిన కాంట్రాక్టు డబ్బుల్ని ఇంకా చెల్లించలేదని ఈ కంపెనీ ఆరోపిస్తోంది.
హైల్ప్ లైన్ కంపెనీ అయిన సైఫ్యూచర్కే డబ్బు చెల్లించకుండా బకాయిపడిన రింగింగ్ బెల్స్.. ఇప్పటికే ఆర్డర్లపై ఆర్డర్లు వచ్చిన కోట్లాది స్మార్ట్ ఫోన్లను అంత చౌక ధరకు ఎలా విక్రయిస్తుందోనని ఐటీ నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదం నుంచి రింగింగ్ బెల్స్ కంపెనీ ఎలా బయటపడుతోందనని వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఫ్రీడమ్ కంపెనీ రూ.251కే స్మార్ట్ ఫోన్లు అందిస్తామంటూ, బుకింగ్ చేసుకోండంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.