యుఎస్ డాలర్ తన బలాన్ని తిరిగి పుంజుకోవడంతో తగ్గిన పసిడి ధరలు

శుక్రవారం, 12 జూన్ 2020 (22:24 IST)
లాక్ డౌన్ చర్యలను ఎలా తొలగించాలి, తమ పౌరులను ఎలా రక్షించుకోవాలి, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలను ఎలా పెంచు
కోవాలి అనేవే, ప్రపంచ ప్రభుత్వాలకు ఒక ప్రధాన ఆందోళనగా ఉంది. వేగవంతమైన ఆర్థిక పునరుద్ధరణ ఆశలు కొనసాగాయి, కాని మహమ్మారి యొక్క రెండవ పునరుత్థాన దశ గురించి భయాలు ప్రపంచ నాయకుల మనస్సులో మెదలుతూనే ఉన్నాయి.
 
బంగారం
యుఎస్ డాలర్ విలువ విపరీతంగా పెరగడంతో గురువారం స్పాట్ బంగారం ధరలు 0.52 శాతం తగ్గి ఔన్సుకు 1736.2 డాలర్లకు చేరుకున్నాయి. దీనివల్ల పసుపు లోహం ధర ఇతర కరెన్సీ హోల్డర్లకు ఖరీదైనదిగా మారింది. అయినప్పటికీ, శీతాకాలంలో ఊహించిన మహమ్మారి యొక్క మరింత ప్రమాదకరమైన రెండవ దశ పట్ల గల ఆందోళన వలన, బంగారం ధరలలో మరింత పతనాన్ని పరిమితం చేసింది.
 
కరోనావైరస్ యొక్క అపారమైన ప్రభావం నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కొన్ని ఆచరణాత్మక ప్రణాళికలను ప్రకటించింది. కరోనావైరస్ తర్వాత ఆర్థిక పునరుద్ధరణ కాలం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం పడుతుంది అనే దానికి ప్రతిగా ఈ చర్య తీసుకోబడింది.
 
వెండి
గురువారం, స్పాట్ వెండి ధరలు 3 శాతం పడిపోయి ఔన్సుకు 17.7 డాలర్లకు చేరుకున్నాయి. ఎంసిఎక్స్ ధరలు 1.15 శాతం పెరిగి కిలోకు రూ. 48639 వద్ద ముగిశాయి.
 
ముడి చమురు
డిమాండ్లు పడిపోవటం మరియు యుఎస్ క్రూడ్ ఇన్వెంటరీ స్థాయిలలో ఏకకాలంలో పెరుగుదల వలన, గురువారం రోజున, డబ్ల్యుటిఐ ముడిచమురు ధరలు 8.2 శాతానికి తగ్గి, బ్యారెల్ కు 36.3 డాలర్ల వద్ద ముగిశాయి.
 
సౌదీ అరేబియా నుండి యుఎస్ ఇన్వెంటరీల దిగుమతిని పెంచినప్పటి నుండి గత వారంలో యుఎస్ ముడి నిల్వలు 5.7 మిలియన్ బ్యారెళ్లకు పైగా పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గిన తరువాత, చైనా మరియు ఇతర ప్రాంతాలలో కొన్నిచోట్ల కరోనావైరస్ కేసులలో తాజా పెరుగుదలను నివేదించాయి. ఇది డిమాండ్ మరియు ధరలు పడిపోవడాన్ని తీవ్రతరం చేసింది.
 
మూల లోహాలు
యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ ప్రచురించిన బలహీనమైన ఆర్థిక డేటా అందుబాటులో ఉన్నందున, గురువారం రోజున, లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (ఎల్ఎమ్ఇ) లో మూల లోహ ధరలు ప్రతికూలంగా ముగిశాయి. ఇది మార్కెట్ మనోభావాలపై భారం పడి ధరలను తగ్గించింది.
 
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, మహమ్మారి యొక్క 2 మిలియన్లకు పైగా దాటిన కేసులతో ముడిపడి ఉంది. హింసాత్మక అల్లర్లు ప్రధాన ఆర్థిక రంగాలలో కూడా వ్యాపించాయి, ఇది తగ్గుతున్న ధరలు మరియు వాణిజ్యానికి మరింత తోడ్పడింది.
 
అయినాకూడా, మౌలిక సదుపాయాల పెరిగిన వ్యయం మరియు చైనా ఉత్పత్తి చేసిన సానుకూల వాణిజ్య డేటాతో పాటు యు.ఎస్ యొక్క విస్తారమైన మరియు అసాధారణమైన కలుగజేసుకోవడం మరియు ఉద్దీపన చర్యల యొక్క ఆశలు, ధరల పతనం ఇక ముందుకు సాగకుండా పరిమితం చేసాయి.
 
రాగి
మహమ్మారి సంబంధిత లాక్ డౌన్ లు మరియు మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయడం వంటి వాటివలన, గురువారం రోజున, ఎల్ఎమ్ఇ కాపర్ ధరలు టన్నుకు 2.4 శాతం తగ్గి 5764.5 డాలర్ల వద్ద ముగిశాయి, మరియు ఉత్పత్తి యూనిట్లు ఎరుపు లోహ ధరలపై భారాన్ని మోపాయి.
 
ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మాంద్యం లాంటి పరిస్థితుల కారణంగా నిరుద్యోగం, ఆకలి మరియు పస్తుల వంటి క్లిష్టమైన సమస్యలను ప్రపంచ ప్రభుత్వాలు ఎలా పరిష్కరించగలవో చూడాలి. లాక్ డౌన్ ల తొలగింపుతో, ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుందని భావిస్తున్నారు.
 
- ప్రథమేష్ మాల్య, ఎవిపి రీసర్చ్ నాన్ అగ్రి కమాడిటీస్ అండ్ కరెన్సీస్, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు