పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పది గ్రాముల బంగారం ధర 90 వేల రూపాయలు చేరుకుంది. వెండి విషయంలోనూ అదే జరుగుతుంది. పది గ్రాముల బంగారం ధరపై 2,100 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధరపై పది వేల రూపాయలు పెరిగింది.
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,43,460 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,56,500 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,70,100 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
అయితే గతంలో బంగారం, వెండిపై పెట్టుబడి సురక్షితమని నమ్మేవారు. ధరలు ఒక్కసారిగా పెరగడం, అంతే స్థాయిలో తగ్గుతుండటంతో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నష్టాలను ఎదుర్కొనాల్సి వస్తుంది.