ప్రపంచ గొప్ప ఆర్థివేత్తల్లో రఘురాం రాజన్ ఒకరని సిద్దూ అన్నారు. ఆర్బీఐ గవర్నరుగా ఆయన అర్హుడన్న విషయం కేంద్రం గుర్తిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ, జైట్లీలలో ఎవరైనా రాజన్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి ఉంటే దానిపై తాను మాట్లాడేవాడినని చెప్పిన ఆయన, సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు.