ఇండియాలో మాంద్యం సాధారణంగా కనిపించే 'వ్యాపార చక్రం' వంటిది కాదని, ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితికి చేరేందుకు మరింత సమయం పడుతుందని, నిదానంగా ముందుకు సాగుతుందని సీఎల్ఎస్ఏ ఎకానమిస్ట్ రాజీవ్ మాలిక్ వ్యాఖ్యానించారు.
మోడీ బాధ్యతలు చేపట్టి 11 నెలలైనప్పటికీ, పెట్టుబడుల విషయంలో ముందడుగు పడడం లేదని వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, "తగ్గిన ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు భారత్ కు సానుకూల అంశాలే అయినప్పటికీ, బలహీనంగా ఉన్న రుతుపవనాలు వెనక్కు లాగుతున్నాయి" అన్నారు.