దేశంలో మళ్లీ చమురు ధరల దూకుడు...

శనివారం, 18 సెప్టెంబరు 2021 (08:57 IST)
దేశంలో మళ్లీ చమురు ధరల దూకుడు మొదలైంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లోని తాజా పరిణామాల నేపథ్యంలో ఆగస్టు చివరివారం నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం దేశంలోని రీటెయిల్‌ మార్కెట్లో పెట్రోలు, డీజిలు అమ్మకాలపై పడుతుంది. 
 
అయితే, గత పక్షం రోజులుగా దేశంలోని పెట్రో ధరల్లో పెంపుదల లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఇపుడున్న పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పదని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆగస్టు నెలలో ఉన్న సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌ చమురు ధర 4 నుంచి 6 అమెరికన్‌ డాలర్లమేర పెరిగిందని గుర్తు చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాజాగా పెట్రోల్ ధరల్లో మార్పులు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోలు రూ.101.19, డీజిలు రూ.88.62 పలుకుతున్నాయి. మెక్సికో సమీపంలోని సముద్రపు ఒడ్డున అగ్నిప్రమాదంతో ఉత్తర అమెరికాలో క్రూడాయిల్‌ ఉత్పత్తి తగ్గింది. అలాగే, యూఎస్‌ - గల్ఫ్‌ తీరంలో ఇడా తుపాను కారణంగా ముడి చమురు ఉత్పత్తిలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజల్ ధరల్లో మార్పులు సంభవించాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు