ఇరాన్పై ఆరు అగ్రదేశాలు ఆంక్షలు ఎత్తివేయడం, చమురు ఉత్పత్తిని ఇరాన్ పెంచడంతో అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు మరింతగా పడిపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బ్యారల్ క్రూడాయిల్ ధర క్రితం ముగింపుతో పోలిస్తే, 1.05 శాతం తగ్గి 48.01 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో జూలై తొలివారంలో సైతం క్రూడాయిల్ ధరలు తగ్గుముఖంగానే ఉన్నందున మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం వెలువడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిపై శుక్రవారం సాయంత్రం లేదా రేపు చమురు సంస్థలు సమావేశమై తమ నిర్ణయాన్ని వెలువరించవచ్చని తెలుస్తోంది. కాగా, తాజాగా లీటరు పెట్రోల్ ధరపై రూ.4 తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.