పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతాయని చర్చ సాగుతోంది. పలు అంశాలపై, ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో పంకజ్ ముండే అంగన్వాడీ నిధుల కుంభకోణం, మధ్యప్రదేశ్లో వ్యాపమ్ కుంభకోణం, లలిత్ గేట్, స్మృతీ ఇరానీ విద్యార్హతలు తదితర ఎన్నో అంశాలపై బీజేపీ సర్కారును ఇరుకున పట్టేందుకు కాంగ్రెస్ సహా విపక్షాలు సిద్ధమయ్యాయి. వీటన్నింటికీ ధీటుగా సమాధానం ఇవ్వాలని అటు బీజేపీ సభ్యులు సైతం గట్టి పట్టుదలతో ఉన్నట్టు సమాచారం.