భారత రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి విధాన సమీక్షను మంగళవారం చేపట్టింది. ఇందులో బ్యాంకుల వడ్డీరేట్లను యధాతథంగా ఉంచాలని ఆర్.బి.ఐ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ రఘురాం రాజన్ వెల్లడించారు. అలాగే, రెపో రేటును 8 శాతం వద్ద యధాతథంగా ఉంచినట్టు చెప్పారు.