నెఫ్ట్ చార్జీలు ఎత్తివేత.. జనవరి 1 నుంచి అమలు

గురువారం, 19 డిశెంబరు 2019 (13:42 IST)
బ్యాంకు ఖాతాదారులకు భారత రిజర్వు బ్యాంకు ఓ శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఆన్‌లైన్ లావాదేవీలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా, 24 గంటల పాటు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాజాగా నెఫ్ట్ లావాదేవీలపై వసూలు చేసే చార్జీలను కూడా ఎత్తివేసింది. 
 
తాజాగా ఇకపై నెఫ్ట్ లావాదేవీలకు ఎటువంటి చార్జీలు వసూలు చేయబోమని తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొంది. జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు వివరించింది. కాగా, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులతోపాటు మరికొన్ని బ్యాంకులు గత కొంతకాలంగా నెఫ్ట్ చార్జీలను వసూలు చేయడం లేదు. ఆర్బీఐ తాజా ఆదేశాలతో ఈ సేవలను అన్ని బ్యాంకులు ఇకపై ఉచితంగా అందించాల్సిన నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు