మరోవైపు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. ఈ పెరుగుదల లీటర్ పెట్రోలుకు 36 పైసలు, డీజిల్కు 87 పైసలు చొప్పున ఉంది. నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు బ్యారెల్ ధర 44 డాలర్లే ఉన్నప్పటికీ ఆయిల్ కంపెనీలు మాత్రం పెట్రో ధరల పెంచేశాయి.
ఇప్పటికే నిత్యావసర వస్తువల ధరలు మండిపోతున్నాయి. పప్పులు, కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పెట్రోలు ధరలు పెంచడంతో పాటు... అన్ని రకాల సర్వీసుల మీద.. స్వచ్ఛ భారత్ సేవా పన్నును వసూలు చేయాలని కేంద్రం భావించడంతో ఈ ధరలు మరింతగా పెగనున్నాయి.