కాగా, ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ.5 లక్షలు చెల్లించి, రూ.15 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధన విధించింది. అయితే, ఈ భవనంను కొనుగోలు చేసేందుకు ఈ-వేలం పాటలు నిర్వహించగా ఒక్క బిడ్డర్లు కూడా ముందుకు రాలేదు. ఈ ముంబైతో ఆస్తులతో పాటు గోవాలో మాల్యాకు చెందిన రూ.90 కోట్ల విల్లాలను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకోనున్నారు. విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల వివరాలను సేకరించాలని సీబీఐ అధికారులు విదేశీ కోర్టులను కోరనున్నారు.