యూఎస్‌లో ఉన్నత విద్యకు ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్స్

మంగళవారం, 8 ఏప్రియల్ 2008 (16:27 IST)
అమెరికా ప్రభుత్వం మనదేశ విద్యార్ధులకు యూఎస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇన్ ఇండియా (యూసెఫీ) సంస్థ ఫుల్‌బ్రైట్ ఫెలోషిప్స్ పేరుతో ఉపకారవేతనాలు అందిస్తుంది. భారత్-అమెరికా దేశాల మధ్య విద్యా-సంస్కృతిక కార్యక్రమాలను ఇచ్చిపుచ్చుకునేందుకు వీలుగా ఈ ఉపకార వేతనాలను ఇస్తున్నారు. ఈ ఉపకార వేతనాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి విద్యార్ధులు, అధ్యాపకులు- ఉపాధ్యాయులు, రీసెర్చి స్కాలర్లు, ప్రొఫెషనల్స్ ఉన్నారు.

ఇందులో భాగంగా విద్యార్దులకు ఏడు రకాల ఉపకారవేతనాలు, రీసెర్చి, అసిస్టెన్స్ విభాగాల్లో ఒక్కొక్క ఉపకార వేతనం లభిస్తాయి. అధ్యాపక-ఉపాధ్యాయ విభాగంలో 11, రీసెర్చి స్కాలర్ల విభాగంలో 7, ప్రొఫెషనల్స్ విభాగంలో 5, డిగ్రీకోర్సుల విభాగంలో 4, రీసెర్చి విభాగంలో 2 ఉన్నాయి. దీనికి సంబంధించిన దరఖాస్తు చేసుకోవటానికి జులై 16 ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్న విద్యార్దులలో కొందరిని ఎంపిక చేసి న్యూఢిల్లీలో మౌఖిక పరీక్షలు నిర్వహిస్తారు.

ఆ తర్వాత టోఫెల్, జీఆర్ఇ, జిమాట్, టీఎస్ఇ పరీక్షలు నిర్వహిస్తారు. తుది జాబిజాను వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేస్తారు. వీరికి కోర్సులు వచ్చే ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ప్రారంభం అవుతుంది. ఇతర వివరాలకు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి