నేడు తెలంగాణాలో పాలిసెట్ స్పాట్ ప్రవేశాలు

మంగళవారం, 9 ఆగస్టు 2022 (08:26 IST)
తెలంగాణ రాష్ట్రంలో నేడు పాలిసెట్ స్పాట్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వం పాలిటెక్నికల్ కాలేజీల్లో స్పాట్ ప్రవేశాల కోసం ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహిస్తారు. మంగళ, బుధవారాల్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సివుండగా, నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 
 
ఈ నెల 16వ తేదీన తుదివిడత సీట్లను కేటాయించనున్నారు. ఎయిడెడ్, ప్రైవేట్ కాలేజీల్లో ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభంకానుండగా, ఈ నెల 16వ తేదీన ఆయా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహణ చేపడుతారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు