జీఈ ఇండియా టెక్నాలజీ సెంటర్‌లో 3వేల ఉద్యోగాలు

జనరల్ ఎలక్ట్రిక్ భారత్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తుంది. ఇందు కోసం ఐదు కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదులో భాగంగా కంపెనీ టెక్నాలజీ సెంటర్ కోసం కొత్తగా 3,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు కెంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఈ ఏడాది చివరి నాటికి ప్లాంటును ఎక్కడి నిర్మించాలనే విషయాన్ని కంపెనీ ఖరారు చేస్తుంది. వచ్చే ఏడాది నుంచి నిర్మాణ పనులను ప్రారంభిస్తాం అని జీఈ ఇండియా అధ్యక్షుడు, సీఈఓ జాన్ ఎల్ ఫ్లానెరీ అన్నారు. వచ్చే మూడేళ్లలో అదనంగా మరో 3,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు జీఈ ఇండియా టెక్నాలజీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ఎమ్ కొర్రియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ 5,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

వెబ్దునియా పై చదవండి