కోలీవుడ్లో సంచలనం సృష్టించిన నటి శశిరేఖ హత్యకేసుకు చిక్కుముడి వీడింది. కోలీవుడ్లో పలు టీవీ సీరియళ్లలో, సినిమాల్లో వర్ధమాన నటిగా ఎదుగుతున్న శశిరేఖ గత నెల 5న చెన్నైలో దారుణ హత్యకు గురైన విషయంతెల్సిందే. ఓ చెత్త కుండీలో దొరికిన మొండెం శశిరేఖదేనని పోలీసులు నిర్ధారించారు. ఆమె తలను అక్కడికి 2 కి.మీ.ల దూరంలోని కొలపాక్కం దగ్గరి కాలువలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. మరో నటి అయిన లకియాతో రమేష్ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అప్పటినుంచి శశిరేఖ, రమేష్ మధ్య గొడవలు మొదలయ్యాయి. రమేష్పై శశిరేఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై కేసు పెట్టిందన్న ఆగ్రహంతో రమేష్, లకియా.. శశిరేఖను దారుణంగా హత్యచేశారు. హత్య చేసి పరారీలో ఉన్న వీరిద్దరిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భర్త రమేష్ శంకర్, ప్రేయసి లక్కియ కలిసి శశిరేఖను హత్య చేసినట్టు వెల్లడించారు.