ముందుగా ఓ పాత్రలో పంచదార వేసి స్టౌ మీద పెట్టి తగినన్ని నీళ్ళు పోయాలి. నీటిని మీడియం మంటపై బాగా మరిగించాలి. ఇందులో పంచదార చేర్చి, కరిగిపోయాక రోజ్ మిల్క్ ఎసెన్స్ను జోడించి బాగా మిక్స్ చేయాలి. స్టౌ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. దీన్ని ఒక గ్లాసులో పోసి ఫ్రిజ్లో స్టోర్ చేసి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోవచ్చు.
బ్లెండర్లో పాలు పోసి , తర్వాత ఒక టేబుల్ స్పూస్ రోజ్ సిరఫ్ వేసి, దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా వేసి బ్లెడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల స్మూతీ షేక్ తయారవుతుంది. అంతే రోజ్ మిల్క్ షేక్ రెడీ. గ్లాసులో పోసి చల్లచల్లగా సర్వ్ చేయాలి. పిల్లలు ఇష్టపడి తాగుతారు.