చలికాలంలో పిల్లలకు బర్గర్లు వద్దు.. ఆపిల్ చాలు!

మంగళవారం, 2 డిశెంబరు 2014 (17:01 IST)
చలికాలంలో పిల్లలకు జంక్ ఫుడ్ అస్సలు పెట్టకండి. ఇవి పిల్లలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. శీతాకాలం కారణంగా జంక్ ఫుడ్స్‌ను పిల్లలు తీసుకోవడం ద్వారా జీర్ణ సంబంధిత రుగ్మతలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 
అందుచేత తేలికగా జీర్ణమయ్యే ఫుడ్‌ను పిల్లలకు అందించాలి. పండ్లు, ముఖ్యంగా రోజుకో ఆపిల్ పండును పిల్లలకు పెట్టాల్సిందే. తద్వారా డాక్టర్ వద్దకు వెళ్లే ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే లైట్ ఆహార పదార్థాలతో ప్రోటీనులు, విటమిన్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. 
 
బర్గర్లు, పిజ్జాలు వంటివి కొనిపెట్టడం కంటే.. ఇంట్లో తయారయ్యే సలాడ్స్, రోటీలు, వేడి వేడి స్నాక్స్ హోం మేడ్‌కే ప్రాధాన్యత ఇవ్వండి. వేడినీటితో తయారైన తాజా పండ్ల రసాలు వంటివి ఇవ్వడం చేస్తే పిల్లల ఆరోగ్యం చలికాలంలో మెరుగ్గా ఉంటుందని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి