కావలసిన పదార్థాలు : చేప ముక్కలు... ఒక కేజీ కొబ్బరితురుము... ఆరు టీ. పసుపు... రెండు టీ. పచ్చిమిర్చి... ఎనిమిది మంచినీరు... పది కప్పులు తాటిబెల్లం తురుము... నాలుగు టీ. చింతపండు పేస్టు... రెండు టీ. బీన్స్ ముక్కలు... ఒక కప్పు కొబ్బరినూనె... రెండు గరిటెలు లేత వెదురుకొమ్మలు... ఒక కప్పు
తయారీ విధానం : చేప ముక్కలను శుభ్రం చేయాలి. కొబ్బరి తురుము, పసుపు, పచ్చిమిర్చిలను కలిపి ముద్దగా నూరాలి. ఓ వెడల్పాటి కుండ తీసుకుని అందులో కొబ్బరినూనెను వేయాలి. స్టవ్పై పెట్టి వేడయ్యాక అందులో పైన నూరుకున్న ముద్దను వేసి కాసేపు ఉడికించి పది కప్పుల నీటిని పోసి మరిగించాలి.
నీళ్లు మరిగిన తరువాత చేప ముక్కలు వేసి కలియబెట్టి, తాటిబెల్లం తురుము వేయాలి. ఆ తరువాత చింతపండు పేస్టు కూడా వేసి, మళ్లీ కాసిన్ని నీటిని పోయాలి. అలాగే కాసేపు మరిగిన తరువాత బీన్స్ ముక్కలు, వెదురుకొమ్మల ముక్కలు వేసి ఉడికించాలి. బాగా మరిగాక ఉప్పువేసి మంట తగ్గించి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా తాజా కొబ్బరితురుముతో కూర పైన అలంకరించి, అన్నంతో కలిపి వడ్డించాలి.