కావలసిన పదార్థాలు : వెన్న ఎక్కువగా ఉండే పాలు... రెండు కప్పులు ఆపిల్ తురుము... ఒక కప్పు జాజికాయపొడి... అర టీ. యాలకుల పొడి... అర టీ. పంచదార... నాలుగు టీ.
తయారీ విధానం : స్టౌ సిమ్లో పెట్టి పాలను పది నిమిషాలపాటు చిక్కగా అయ్యేదాకా మరిగించాలి. అందులోనే ఆపిల్ తురుము, జాజికాయపొడి, యాలకులపొడి, పంచదార వేసి మరో పది నిమిషాలు అడుగు అంటకుండా కలుపుతూ మరిగించాలి. ఈ మిశ్రమం చల్లబడ్డాక కాసేపు ఫ్రిజ్లో ఉంచి, చల్లచల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే ఆపిల్ మిల్క్ రబ్డీ సిద్ధమైనట్లే...!