కావలసిన పదార్థాలు : చేపల కీమా... పావు కేజీ చక్కెర... పావు కేజీ నెయ్యి... వంద గ్రా. ఎండుకొబ్బరి పొడి... 50 గ్రా. జీడిపప్పు... 25 గ్రా. కార్న్ఫ్లోర్... 20 గ్రా. యాలకుల పొడి... పావు టీ. వెనీలా ఎసెన్స్... పావు టీ. మిరియాల పొడి... కొద్దిగా శొంఠిపొడి... కాస్తంత పచ్చకర్పూరం పొడి... పావు టీ.
తయారీ విధానం : చేప కీమాలో శొంఠిపొడి కలిపి నేతిలో దోరగా వేయించి పంచదార పోసి కొద్దిగా నీళ్లు చల్లాలి. దీన్ని చిన్న మంటమీద కలుపుతూ తీగపాకం వచ్చేవరకూ ఉడికించాలి. పాకం వస్తుండగానే మిరియాలు, యాలకులు, కొబ్బరి, కార్న్ఫ్లోర్, పచ్చకర్పూరం, శొంఠిపొడి, ఎండుకొబ్బరి పొడులు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి.
తరవాత జీడిపప్పు, వెనీలా ఎసెన్స్ వేసి నీళ్లన్నీ ఇగిరేవరకూ ఉడికించి దించాలి. దీన్ని ఓ బౌల్లో సర్ది ఆరాక ప్లేటులో బోర్లించాలి. ఉడికిన స్వీటును ఫిష్ ఆకారంలో ఉన్న బౌల్లో సర్ది, ఆరిన తరవాత ప్లేటులో బోర్లించి, ఓ మిరియపు గింజను కన్నుగా అతికించి, చాకొలెట్ క్రీము, ఐసింగ్ షుగర్లతో పొలుసులుగా డిజైన్ చేసి సర్వ్ చేస్తే... చూసేందుకు అచ్చం చేపలాగే ఉంటుంది.