కావలసిన పదార్థాలు : పెద్దసైజు చేప ముక్కలు... పావు కేజీ నూనె... తగినంత ఉప్పు... సరిపడా కార్న్ఫ్లోర్... పావు కప్పు వెనిగర్... ఒక టీ. ఉల్లిరసం... ఒక టీ. కొత్తిమీర తురుము... ఒక టీ. అల్లం పచ్చిమిర్చి పేస్టు.. ఒక టీ. కారం... అర టీ. పసుపు... కొద్దిగా మిరియాల పొడి... అర టీ. గరంమసాలా... అర టీ. ఆరెంజ్ ఫుడ్ కలర్... పావు టీ.
తయారీ విధానం : కడిగిన చేప ముక్కలకు పసుపు రాసి ఉంచాలి. వెడల్పాటి గిన్నెలో కార్న్ఫ్లోర్, వెనిగర్, ఉల్లిరసం, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కారం, మసాలా పొడి, మిరియాల పొడి, ఫుడ్ కలర్, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చిక్కటి గుజ్జులా చేయాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకు బాగా పట్టించి, అరగంటసేపు అలాగే ఉంచాలి.
తరువాత కడాయిలో నూనె పోసి... బాగా మరుగుతుండగా చేపముక్కలను ఒక్కోదాన్ని వేసి రెండు వైపులా బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. నూనె వద్దనుకునేవారు చేపముక్కలను ఒక పాత్రలో అమర్చి మైక్రోవేవ్ ఓవెన్లో సాధారణ ఉష్ణోగ్రత వద్ద చేప ముక్క కరకరలాడేదాకా ఉంచి తీసేయాలి. అంతే ఫిష్ ఫ్రైసీ ఫ్రై చాప్స్ రెడీ...!