కావలసిన పదార్థాలు : టైగర్ ఫ్రాన్స్ (రొయ్యలు)... అర కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్... నాలుగు టీ. ఉల్లిపాయలు... రెండు పండుమిరపకాయలు.. రెండు బ్లాక్ బీన్స్ పేస్ట్... నాలుగు టీ. మిరియాలపొడి... ఒక టీ. సోయాసాస్... రెండు టీ. ఉప్పు... తగినంత
తయారీ విధానం : రొయ్యలను శుభ్రంచేసి, తడి లేకుండా చూసుకోవాలి. ఒక పాన్లో మీడియం సెగమీద వాటిని రెండు నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషంపాటు వేయించి... రొయ్యలు, బ్లాక్ బీన్స్ పేస్ట్, మిరియాల పొడి, సోయాసాస్ వేసి మగ్గనివ్వాలి. చివరగా ఉప్పు కలిపి దించేయాలి. చైనీయులు ఈ పద్ధతిలో చేసే రొయ్యల కూరను చాలా ఇష్టంగా తింటారు.